ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఆ సంస్థ సీఈఓ నుంచి భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ను తప్పించేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్తో సమావేశమైన మస్క్.. పాత కార్యవర్గంపై తనకు ఎలాంటి నమ్మకం లేదని అభిప్రాయపడ్డాడు. దీంతో పరాగ్ను తప్పించడం పక్కా అని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఒకవేళ పరాగ్ను సీఈఓ నుంచి తప్పించాల్సి వస్తే మస్క్.. పరాగ్కు 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.