తీవ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసినా తనకు నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణం మధ్యలో రోడ్డుపైన ఆగిపోతున్న వాహనం తనకొద్దని తేల్చిచెప్పారు. సదరు వాహనాన్ని తీసుకెళ్లాలంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి గురువారం లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని ఇటీవల రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తన భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.