వింతైన లోహపు గోళాలు ఆకాశం నుంచి జారిపడుతుండడం గుజరాత్లో కలకలం రేపుతోంది. అక్కడి సురేంద్రనగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో ఇలా లోహపు గోళాలు వరుసగా పడుతున్నాయి. ఈ గోళాలు పక్షి ఈకల రూపంలో తీగలుగా ఉండడంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. దీంతో వీటి సంగతి తేల్చాలని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిపుణులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇవి శాటిలైట్ శకలాలా, లేదా ఏదైనా విమాన విడిభాగాలా అన్నది తేలాల్సి ఉంది.