సాయిపల్లవి, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న కమ్యూనిస్టుల కథ ‘విరాట పర్వం’ నుంచి ‘నగాదారిలో’ పాట విడుదల అయింది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ లేటెస్ట్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగదారాఇలో.. చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో’ అంటూ సాగే ఈ పాటకు నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్లు లిరిక్స్ అందించారు.