మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబోలో సిద్ధమైన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే వైజాగ్ లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ రానున్నట్లు సమాచారం. ఆయన నటిస్తున్న వీర సింహారెడ్డి చిత్రం కూడా పండగ రిలీజ్ కు ఉండడం, ఆ మూవీకి, వాల్తేరు వీరయ్యకు ప్రొడ్యూసర్స్ ఒకరే కావడం తెలిసిందే. దీంతో నిర్మాతలు బాలయ్యను కూడా ఈ ఈవెంట్ కు పిలవాలని ఆలోచిస్తున్నారు.