వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన కేసును కప్పి పుచ్చడానికే ప్రభుత్వం అమలాపురంలో అల్లర్లు సృష్టించిందని మహానాడులో చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘తనకు సిఎం పదవి కొత్త కాదు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. మళ్ళీ ఛాన్స్ రాదేమోనన్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక్కసారే కదా అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుందో ప్రజలు తెలుసుకున్నారు. కోనసీమలో అల్లర్లు.. ఎమ్మెల్సీ హత్య కేసును డైవర్ట్ చేసేందుకేనని గ్రహించారు’ అని చెప్పారు.