పార్టీ ఆదేశిస్తే ఏ క్షణమైనా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధంగా ఉన్నానని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిల్లోనూ వైకాపా ఎమ్మెల్యేలపై పోరాడాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా టిడిపి ప్రణాళికలు రచిస్తోందన్నారు.