నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నిన్న హైదరాబాద్లో ఆయనను ఎపి సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసుతో పాటు టెన్త్ పరీక్షా పేపర్ల లీకేజ్ వ్యవహారంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టులో ఆయనకు బెయిల్ పిటిషన్పై వాదించిన లాయర్లు 2014లోనే నారాయణ సంస్థల ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారని ఆధారాలతో చూపించడంతో బెయిల్ మంజూరైంది.