యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులకు ఓ విజ్ఞప్తిని చేశారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ‘నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. మీరు తప్పనిసరిగా నా అభ్యర్థనను అంగీకరించండి. ఏటా ఐదుగురు విదేశీయుల్ని భారత్లో పర్యటించేలా పంపించండి. అక్కడ ఎలాంటి పర్యాటక ప్రాంతాలున్నాయో వారికి వివరించి వారిలో స్ఫూర్తిని నింపండి. మీరంతా భారత్కు ప్రతినిధుల వంటివారు’ అని మోదీ పేర్కొన్నారు.