రోడ్ రేజ్ కేసులో దోషిగా తేలి పంజాబ్లోని పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అక్కడ రోజువారీ క్లర్క్గా రోజుకు రూ.90 వేతనంతో పనిచేస్తున్నాడు. జైలులో అతడికి 3 నెలల శిక్షణ అనంతరం కోర్టుకు వెళ్ళాల్సిన ఫైల్స్ను జైల్ రికార్డ్స్ చూసుకుంటాడు. 1988లో జరిగిన ఓ వివాదంలో సిద్ధూ, అతడి ఫ్రెండ్స్ ఓ వృద్ధుడిని కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసును రీ ఓపెన్ చేసిన సుప్రీంకోర్టు ఇటీవల అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది.