ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో గడిచిన వారం రోజుల్లో ఏకంగా 100 మంది గుండెపోటుతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరిలో 54 మంది ఆసుపత్రికి చేర్చేలోపే మరణించడం గమనార్హం. ఎల్పీఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆసుపత్రిలోనే ఏకంగా 44 మంది చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ఆసుపత్రిలో గడిచిన వారం రోజుల డేటా ప్రకారం ఏకంగా 723 మంది గుండెపోటుతో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఎస్పిఎస్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారు. ఇక్కడ గుండెపోటుతో 604 మంది చికిత్స తీసుకుంటున్నారు.