టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు రిపబ్లిక్ డే రోజున కేంద్రం పరమ్ విశిష్ఠ సేవా మెడల్ను బహూకరించనుంది. ఆయనతో పాటు మొత్తం 384 మందికి గాలెంటరీ అవార్డులను కేంద్రం బహూకరించనుంది. భారత ఆర్మీలో 4 రాజ్పుతన రైఫిల్స్ విభాగంలో సుబేదార్గా ఉన్న నీరజ్కు సమ్మర్ గేమ్స్లో చేసిన కృషికి గానూ ఈ అవార్డును కేంద్రం అందించనుంది.