అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీలంక నేషనల్ ఎయిర్లైన్స్ను అమ్మేయనున్నట్లు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. 124 మిలియన్ డాలర్ల అప్పులతో ఉన్న ఈ విమానయాన సంస్థను అమ్మేసి కాస్త నష్టాలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 1975లో ఏర్పాటైన ఈ శ్రీలంక ఎయిర్లైన్స్ 61 దేశాల్లోని 126 డెస్టినేషన్స్కు తమ సర్వీసులను నడుపుతోంది.