జమ్మూ కశ్మీర్ డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిండు నూరేళ్ళు బతకాల్సిన చిన్నారి 2 రోజుల్లోనే మరణించింది. జమ్మూ కశ్మీర్లోని బనీహాల్లో మే 22న పుట్టిన చిన్నారి… పురిట్లోనే చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో తండ్రి బసారత్ బిడ్డను దగ్గర్లోని ఓ తోటలో ఖననం చేశాడు. అయితే శవాన్ని అక్కడ నుంచి తీయాలని ప్రజలు డిమాండ్ చేయడంతో పాపను గుంతలోంచి తీస్తున్నప్పుడు పాప బతికే ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స అందించగా.. 2 రోజులు బతికిన పాప ఆ తర్వాత మరణించింది.