తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ క్యూలైన్లోకి భారీగా ఆ వర్షపు నీరు పోటెత్తింది. దీంతో పాటు వర్షపు నీరు ధాటికి కొత్తగా వేసిన రోడ్లు పలు చోట్ల కుంగిపోయాయి. ఒక్క వర్షానికే కొత్త రోడ్లు నాశనం అవ్వడం ఏమిటని గుడికి వచ్చిన భక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారుల వైఫల్యం, కాంట్రాక్టర్ల నిర్ల్యక్షం కారణంగానే రోడ్లు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.