పచ్చని పెళ్ళి మండపంలో పెళ్ళికూతరు అక్క భర్త రక్తపుటేరులు పారించాడు. మరదలకు జరుగుతున్న పెళ్ళిని జీర్ణించుకోలేని బావ రాజేశ్ పటేల్ పెళ్ళికొడుకుకు ఓ టెడ్డీని గిఫ్ట్గా ఇచ్చి అందులో బాంబు అమర్చాడు. దీంతో ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుండగా పేలిపోయి వరుడికి కళ్ళు, చేతులు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్ను.. భార్య, వాళ్ళ కుటుంబంపై ఉన్న కోపంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. టెడ్డీలో జిలెటిన్ స్టిక్స్, డెటోనేటర్లు కూడా ఉన్నాయని తేల్చారు.