భారతీయులు అతి వేగంగా లావైపోతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్డ్ చెబుతోంది. ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఈ ఊబకాయం సమస్య మధ్య, దిగువ ఆదాయ దేశాలకూ వ్యాపిస్తోందని తెలిపింది. ఒకప్పుడు పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇప్పుడు ఊబకాయం అత్యంత తీవ్ర సమస్యగా మారిందని పేర్కొంది. ఊబకాయం అధికంగా ఉన్న టాప్ 5 కంట్రీస్లో మనమూ ఉన్నామని ఈ సర్వే పేర్కొంది. 2016 లెక్కల ప్రకారం భారత్లో ఊబకాయుల సంఖ్య 1.35 కోట్ల వరకూ ఉందని పేర్కొంది.