తమిళనాడులో 9 మంది శ్రీలంక జాతీయుల్ని జాతీయ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. వీరంతా మన దేశంలో నిషేధిత ఎల్.టి.టి.ఈ. ఉగ్రవాద సంస్థకు రిక్రూట్ మెంట్ జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడు లో ఉంటున్న తమిళ నిరాశ్రయులే లక్ష్యంగీ వీరు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈళం లో రిక్రూట్ మెంట్ కు ప్రయత్నించారని తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు శ్రీలంక వాసులు.. పాక్ కు చెందిన డ్రగ్ డీలర్ హాజి సలీమ్ తో నిరంతరం టచ్ లో ఉన్నారని, దుబాయ్, పాక్, ఇరాన్ దేశాలకు వీరిద్దరూ తరచూ ప్రయాణిస్తున్నారని గుర్తించారు.