తెలంగాణలో మిస్సింగ్ అయిన మెడికల్ విద్యార్థి రాధను మావోయిస్టుల్లో చేర్పించారనే ఆరోపణలపై హైకోర్ట్ అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా శిల్ప ఆఫీసు, ఇళ్ళల్లో పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. మావోయిస్ట్ నేత శంకర్ కొడుకు ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు.