పెళ్లి పేరుతో 300ల మహిళలను మోసం

By udayam on May 28th / 4:46 am IST

దాదాపు 300లకు పైగా మహిళలను పెళ్ళి పేరుతో వంచించిన ఓ నైజీరియా దేశస్తుడిని ఉత్తర ప్రదేశ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి నిందితుడు కోట్ల రూపాయల్లో దండుకున్నాడని పేర్కొన్నారు. సోషల్​ మీడియా, మ్యాట్రిమోనియల్​ వెబ్​సైట్స్​ ద్వారా నిందితుడు మహిళకు దగ్గరయ్యేవాడని, ఆపై మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజేవాడని తెలిపారు. తాను ఎన్​ఆర్​ఐ నని, కెనడాలో సెటిల్​ అయ్యానంటూ అతడు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు డబ్బులు పంపేవారని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్​