నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కి పాన్ ఇండియా హిట్ గా నిలిచిన చిత్రం ‘కార్తికేయ–2’. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే యూనిట్ వెల్లడించినా.. తాజాగా హీరో నిఖిల్ దానిని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యువ హీరో.. నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో జరిగిన #AskNikhil చిట్ చాట్ లో కార్తికేయ–3 ఉంటుందని కన్ఫర్మ్ చేసేశాడు. ఆ మూవీని ఈసారి 3డీ వర్షన్ లో దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడించాడు.