కారుపైకి దూసుకెళ్ళిన బస్సు.. 9 మంది మృతి

By udayam on December 31st / 5:44 am IST

గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్‌లోని ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమం నుంచి వల్సాద్ వెళ్తున్న లగ్జరీ బస్సు.. నవసారి జాతీయ రహదారిపై అదుపుతప్పి టొయోటా ఫార్చునర్ కారుపైకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు నియంత్రణ కోల్పోయి కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ట్యాగ్స్​