బ్యాంకులకు అప్పులు ఎగవేసి.. యుకెకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని వచ్చే 28 రోజుల్లో భారత్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ కు అతడిని అప్పగించాలన్న యుకె కోర్ట్ తీర్పుకు తోడు.. అతడు సుప్రీంకోర్టుకు వెళ్తానన్న పిటిషన్ కూడా రద్దు కావడంతో అతడిని భారత్ కు అప్పగించడానికి యుకె చర్యలు చేపట్టింది. లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తయిన వెంటనే అతడిని భారత్ కు అప్పగించనున్నారు. అయితే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి వ్యతిరేకత రాకపోతేనే అతడు భారత్ కు రావడం తేలికవుతుంది.