ఎయిమ్స్​ నుంచి నిర్మలమ్మ డిశ్చార్జ్​

By udayam on December 30th / 4:47 am IST

ఇటీవల అనారోగ్యంతో ఢిల్లీ లోని ఎయిమ్స్​ ఆసుపత్రిలో చేరిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ గురువారం సాయంత్రం డిశ్చార్జ్​ అయ్యారు. కడుపునొప్పికి మూడు రోజుల చికిత్స తీసుకున్న అనంతరం ఆమెకు నయం కావడంతో వైద్యులు డిశ్చార్జ్​ చేశారు. నిర్మలా సీతారామన్​ వచ్చే రెండు నెలల్లో దేశ ఆర్ధిక బడ్జెట్​ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీ బడ్జెట్​ సమావేశాలను కూడా ఆమె పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం నుంచి చివరి బడ్జెట్​ ఇదే కానుంది.

ట్యాగ్స్​