ఢిల్లీ కార్పొరేషన్ సభలో అధికార ఆప్, ప్రతిపక్ష భాజపా శ్రేణులు రెచ్చిపోయాయి. దీంతో ఈరోజు జరగాల్సిన మేయర్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. డెస్క్ లపైకి ఎక్కి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, పేపర్లు విసురుకోవడం చేయడంతో మేయర్ ఎన్నిక జరగకుండా సభ వాయిదా పడింది. ఆప్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి శ్రేణులు అరవింద్ కేజ్రీవాల్ లకు వ్యతిరేకంగా సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ రచ్చ మొదలైంది. ఢిల్లీ ఎల్జీ నియమించిన నామినేటెడ్ సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమవ్వగా ఆప్ శ్రేణులు నినాదాలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది.
#WATCH | Delhi: Ruckus at Civic Center as BJP, AAP councillors clash with each other amid ensuing sloganeering ahead of Delhi Mayor polls. pic.twitter.com/v1HXUxawSC
— ANI (@ANI) January 6, 2023