జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండిట్లపై జరుగుతున్న వరుస దాడులకు భయపడి అక్కడి హిందువులను వ్యాలీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 18 మంది సాధారణ పౌరులను తీవ్రవాదులు కాల్చి చంపడంతో స్థానిక హిందువుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన 2 రోజుల్లో ఇక్కడ ఓ టీచర్తో పాటు బ్యాంకు మేనేజర్ను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వంలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులు సైతం తమకు వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేయాలని 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు.