కేంద్రం అమలు చేస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ఒక్కరినీ వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వం బలవంతం చేయరాదని పేర్కొంది. డాక్టర్ జాకబ్ పులియెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ఇండియా కేసులో జస్టీస్ ఎల్.నాగేశ్వరరావు, బిఆర్.గవానీల బెంచ్.. ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఆదేశాల మేరకు బలవంతంగా వ్యాక్సిన్ తీసుకోమని ప్రజలను బలవంతం చేస్తోందని వ్యాఖ్యానించింది.