న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీచేసింది.
2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించడంతో తాజాగా అరెస్ట్ వారెంట్జారీ అయ్యింది.
అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణ మార్చి 8కి వాయిదా వేసింది.