తమ దేశంలో కరోనాతో ఓ వ్యక్తి మరణించాడని ఉత్తర కొరియా తొలిసారిగా ప్రకటించింది. ప్రపంచ దేశాలను 2019 నుంచి కరోనా పట్టి పీడిస్తున్నా.. ఈ దేశం ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదైనట్లు కానీ, మరణాలు సంభవించినట్లు చెప్పలేదు. బుధవారం నాడు మా దేశంలో కరోనా ఉధృతి పెరిగిందని, దాంతో దేశం మొత్తం లాక్డౌన్ పెట్టినట్లు చెప్పిన ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా.. తాజాగా గురువారం నాడు ఒమిక్రాన్ వేరియంట్తో ఒక మరణం సంభవించినట్లు ప్రకటించింది.