వరుసపెట్టి క్షిపణి పరీక్షలు చేస్తున్న నార్త్ కొరియా బుధవారం ఉదయం మరో మూడు క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. కేవలం గంట వ్యవధిలోనే మూడు మిస్సైళ్ళను ప్యాంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం నుంచి నార్త్ ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటనను ముగించుకుని వెళ్తున్న సమయంలోనే నార్త్ కొరియా ఈ క్షిపణి పరీక్షలు జరపడం గమనార్హం.