ఏఎస్​: కుతుబ్ మినార్‌పై ఎవరికీ హక్కు లేదు

By udayam on May 24th / 10:58 am IST

కుతుబ్ మినార్‌ కాంప్లెక్స్‌లోని ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి సాకేత్ కోర్టులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ ప్రదేశంలో ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన మద్యంతర దరఖాస్తుపై ఏఎస్​ఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కుతుబ్‌ మినార్‌ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోందన్న ఏఎస్​ఐ అలాంటి చోట నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.

ట్యాగ్స్​