భారత్ వంటి పెద్ద దేశానికి ఆర్ధిక మంత్రిగా సేవలందిస్తూ విశేష గుర్తింపు తెచ్చుకున్న తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ తన మంచి మనసును చాటుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో జాతీయ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎండి.పద్మజా చుండూరుకు స్వయంగా మంచినీళ్ళ బాటిల్ను, గ్లాస్ను తీసుకెళ్ళి అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. నీళ్ళ కోసం చుండూరు అడిగిన కాసేపటికి నిర్మలమ్మ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఆమెకి అందించారు.