గడిచిన జూన్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. వాహన్ డేటా ప్రకారం భావిష్ అగర్వాల్ కంపెనీకి జూన్లో కేవలం 5,869 స్కూటర్ల ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. ఏప్రిల్లో ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీగా నిలవగా ఇప్పుడు అది 4వ స్థానానికి పడిపోయింది. మేలో కాస్త తగ్గిన సేల్స్ జూన్లో మరో 30 శాతానికి పడిపోయాయి. ఒకినావా కంపెనీ 6,976 యూనిట్లతో తొలిస్థానంలో, ఆంపెర్ 6,534 యూనిట్లతో 2వ ప్లేస్లో ఉండగా హీరో ఎలక్ట్రిక్ 6,486 ఆర్డర్లతో 3వ ప్లేస్లో ఉంది.