54 వేల లౌడ్​స్పీకర్లు తొలగించిన యోగి సర్కార్​

By udayam on May 2nd / 12:33 pm IST

ఉత్తరప్రదేశ్​ వ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఉన్న 54 వేల లౌడ్​స్పీకర్లను యోగి సర్కార్​ తొలగించింది. మరో 60 వేల లౌడ్​స్పీకర్లలో సౌండ్​ను తగ్గించినట్లు పేర్కొంది. ఈ పనిని కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే యోగి సర్కార్​ పూర్తి చేశామని ఆ రాష్ట్ర లా అండ్​ ఆర్డర్​ ఎడిజి ప్రశాంత్​ కుమార్​ పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న అన్ని లౌడ్​ స్పీకర్లపైనా తాము చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​