దేశంలో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంఖ్యే నిజమైనదని ట్విట్ర్లో రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.8 లక్షలు కాదన్న ఆయన.. 48 లక్షలు గా పేర్కొన్నారు. సైన్స్ ఎప్పుడూ అబద్దం చెప్పదని.. నరేంద్ర మోదీనే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.