చైనా ప్రీమియం స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ తన తర్వాతి తరం 11 సిరీస్ ను జనవరి 4న రివీల్ చేయనుంది. ఫిబ్రవరి 7 నుంచి అమ్మకాలు జరుపుకొనే ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్ తో పాటు 12, 16 జిబి రామ్ లు ఉండనున్నాయి.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్స్ లో విడుదల కానుంది. ఈ మేకు వన్ ప్లస్ తన అధికారిక వీబో పేజీలో ఫోన్ ఫొటోస్ ను విడుదల చేసింది. భారత్ లో వన్ ప్లస్ ప్రారంభ ధర రూ.55 వేలుగానూ, ప్రీమియం ఫోన్ ధర రూ.65 వేలుగా ఉండనున్నాయి.