ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ దేశంలోని దిగ్గజ ప్రైవేటు కంపెనీలు సైతం కుళ్ళుకునేలా లాభాలను ఆర్జించింది. 2021–22 నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థ రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్లు ప్రకటించడంతో దేశ కార్పొరేట్ రంగం అవాక్కయింది. టిసిఎస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీలతో పోల్చితే ఓఎన్జీసీ లాభాలే ఎక్కువ. 4వ త్రైమాసికంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే ఈ సంస్థ కంటే భారీ లాభాలు సాధించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఆయిల్ ధరలు పెరగడం ఒఎన్జీసీకి కలిసి వచ్చింది.