ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్లో మూతపడ్డ 22 గదులను తెరవాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి అలహా బాద్ హైకోర్ట్ మెట్లెక్కాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. దీంతో ఈ కట్టడంలోని గదులను తెరిచి హిందూ దేవుళ్ళ ప్రతిమలను వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతివ్వాలని, ఈ తలుపుల వెనుక పురాతన శివుని ఆలయం సైతం ఉందని హిందూ చరిత్ర కారుల సంఘం కోర్టు మెట్లెక్కింది.