ఈనెల 17 నాటికి కాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలోనే ఉన్న జ్ఞానవాపి శృంగార్ గౌరీ కాంప్లెక్స్లోని హిందూ దేవతల విగ్రహాల భద్రతపై వీడియో రికార్డింగ్ చేపట్టాలని జిల్లా కోర్ట్ ఇచ్చిన తీర్పును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఈ తీర్పు 1991లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని చెప్పారు. ‘మేం మరో మసీదును కోల్పోవడానికి సిద్ధం లేం’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు టైటిల్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ సర్వే జరుగుతోందన్నారు.