ప్రపంచ ప్రఖ్యాత ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ కంపెనీ ఉత్పత్తులను తయారు చేస్తున్న పేజ్ ఇండస్ట్రీస్.. తెలంగాణలో రూ. 290 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రెండు ఫెసిలిటీస్ ను ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ.. స్థానికంగా 7 వేల మందికి ఉపాధిని ఇవ్వనుంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటిఆర్ తో ఈ కంపెనీ బృందం భేటీ అయింది. ఇబ్రహీంపట్నం, ములుగు ప్రాంతాల్లో ఈ కంపెనీ తమ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఏడాదికి కోటికి పైగా గార్మెంట్స్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీ ప్లాంట్లు పనిచేయనున్నాయి.
Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state
Hearty Welcome & best wishes to the company as it embraces Telangana 👍 pic.twitter.com/HAHGtqy3jx
— KTR (@KTRTRS) November 16, 2022