డ్రాగా ముగిసిన పాక్​–న్యూజిలాండ్​ 2 వ టెస్ట్​

By udayam on January 6th / 1:31 pm IST

న్యూజిలాండ్​ తో జరుగుతున్న రెండో టెస్ట్​ లో పాకిస్​థాన్​ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్​ ను ఆ జట్టు మాజీ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​ 118 పరుగులతో ఆదుకున్నాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ అతడొక్కడే అడ్డుగోడలా నిలబడిపోయాడు. దీంతో పాకిస్థాన్​ 5వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి మ్యాచ్​ ను డ్రాగా ముగించుకుంది. ఈ మ్యాచ్​ ఫలితంతో డబ్ల్యూటిసి ఫైనల్స్​ టేబుల్​ లో పాకిస్థాన్​ 7, న్యూజిలాండ్​ 8వ స్థానాల్లో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్​ లు ఉన్నాయి.

ట్యాగ్స్​