పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతంది. ఆ దేశ విదేశీ మారక నిల్వలు గురువారం నాడు 294 మిలియన్ డాలర్లు కరిగిపోయి.. 5.8 బిలియన్లకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఈ దేశం దివాళా తీయనుందని ప్రపంచ ఆర్ధిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ లో 9.816 బిలియన్ల ఆర్ధిక నిల్వలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ లో ఉండగా.. గడిచిన 6 నెలల్లో ఆ మొత్తం సగానికి తగ్గిపోయింది. దీంతో ఈ దేశం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించడం అటుంచితే కనీసం దిగుమతులకు సైతం చెల్లింపులు చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తనుంది.