ఆఫ్ఘనిస్థాన్కు చెందిన టిటిపి ఉగ్రసంస్థతో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 30 మంది కరడుగట్టిన ఉగ్రవాదుల్ని తమ జైళ్ళ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. విడుదలైన టెర్రరిస్టుల్లో చాలా మంది ఖైబర్ పఖ్తుంక్వా, అక్కడి ట్రైబల్, దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతాలకు చెందిన వారేనని తెలిపింది. అదే సమయంలో విడుదలైన వారిలో హై ప్రొఫైల్ టెర్రరిస్టులు లేరని పాకిస్థాన్ తన దేశ ప్రజలకు సర్ధి చెప్పుకుంది.