పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్లను బాంబులతో పేల్చేయడానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఐఎస్ఐ తీవ్రవాదులు ప్రయత్నించనున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది. ప్రధానంగా గూడ్స్తో వెళ్ళే ట్రైన్లను టార్గెట్ చేయనున్నారని తెలిపింది. ఇందుకోసం ఐఎస్ఐ తీవ్రవాదులకు భారీ ఎత్తున నిధులు సైతం సమకూరాయని పేర్కొంది. భారత్లోని పాక్ స్లీపర్ సెల్స్ ఇలా ట్రైన్ పట్టాలను కూల్చితే వారికి భారీ మొత్తం దక్కనుందని సైతం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పందింది.