పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను వినియోగించకూడదని ఆ దేశ పార్లమెంట్ చట్టం చేసింది. అదే సమయంలో విదేశాల్లో ఉండే పాకిస్థానీయులు ఐ–ఓటింగ్ ద్వారా పాల్గొనడాన్ని సైతం రద్దు చేసింది. ఈ మేరకు ఇటీవల ఎన్నికైన నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సభలో ప్రవేశపెట్టగా.. దానికి సభ ఆమోద ముద్ర వేసింది.