బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి ఏడాదికి విత్ డ్రా చేసే వారు ఇకపై పాన్, ఆధార్ కార్డ్ల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కొత్త ఇన్కంటాక్స్ రూల్స్ నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ రూల్ రూ.20 లక్షలు, అంతకు పైబడ్డ విత్ డ్రాలకు సైతం వర్తిస్తుందని ఐటి శాఖ ప్రకటించింది. కరెంట్, సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్, కో ఆపరేటివ్ బ్యాంకులకూ ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది.