గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీకి కలిసి పనిచేసిన డైరెక్టర్ పరశురామ్, లైగర్ విజయ్ దేవరకొండలు మరో కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు వీరిద్దరితో ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ఖుషీ మూవీ షూటింగ్ కు కాస్త విరామం రావడంతో పరశురామ్ మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ డేట్స్ మళ్ళీ బిజీ అయ్యే లోపు ఈ మూవీలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేయాలని పరశురామ్, దిల్ రాజుల ప్లాన్ గా తెలుస్తోంది.