ఉన్నదంతా ఖర్చు పెట్టి చదివించిన కొడుకుపైనే ఓ తల్లిదండ్రులు అసాధారణ కేసు పెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆడుకోవడానికి తన కొడుకు, కోడలు మనవల్ని ఇవ్వడం లేదని, ఏడాదిలోగా పిల్లల్ని కనకపోతే రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు కోర్టుకెక్కారు. ఉత్తరాఖండ్కు చెందిన సంజీవ్ (61), సాధనా ప్రసాద్లు (57) అనే తల్లిదండ్రులు తన కొడుకు శ్రేయ్ సాగర్ (35), కోడలు సుభాంగి సిన్హా (31) లపై ఈ వ్యాజ్యం వేశారు.