ఐపిఎల్ చివరి దశకు వచ్చే సరికి జట్లు తమ స్టార్ ప్లేయర్లను కోల్పోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ పృధ్వీ షాను, ముంబై, సూర్య కుమార్ యాదవ్ను, చెన్నై జడేజాను, హైదరాబాద్ వాషింగ్టన్ సుందర్లను కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ స్టార్ ఆసీస్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ సేవలను కోల్పోయింది. అతడికి గత మ్యాచ్లో తుంటి ఎముక గాయం కాగా.. అది ఇప్పుడు మరింత ముదిరిందని ఆ జట్టు తెలిపింది. దీంతో అతడు స్వదేశానికి పయనమయ్యాడు.