ప్రశాంతంగా ఉండే పచ్చని కోనసీమలో నిప్పు పెట్టింది ప్రభుత్వమే అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాను ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఈ ఆందోళనలు జరిగేవి కావన్న ఆయన.. గొడవలు జరగాలనే కోనసీమ జిల్లా పేరును మార్చారని ఎద్దేవా చేశారు. మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ కూర్చున్నారంటే ఏమనుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు.